నేడు ముద్రగడతో సోము భేటీ?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంను కలవనున్నారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా రాజకీయాలకు, [more]

Update: 2021-01-16 03:08 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంను కలవనున్నారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా రాజకీయాలకు, ఉద్యమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ముద్రగడను బీజేపీలోకి రప్పించాలని సోము వీర్రాజు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. తిరుపతి ఉప ఎన్నికకు ముందే ముద్రగడకు పార్టీ కండువా కప్పేయాలని భావిస్తున్నారు. మరి ఈరోజు సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభంను కలుస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News