టీడీపీ ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ… ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి

పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ, బీజేపీలు ప్రైవేటుగా ప్రేమాయణం సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు [more]

Update: 2019-02-11 09:06 GMT

పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ, బీజేపీలు ప్రైవేటుగా ప్రేమాయణం సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు తెలుగుదేశం పార్టీ నేతలు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు. అయితే, ఈ ఫ్లైట్లో బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబు ఉన్నారు. ఈ ఫోటోను ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి… బీజేపీతో కటీఫ్ అంటూనే బాబు ఆండ్ కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టురట్టయ్యిందని పేర్కొన్నారు. టీడీపీ స్పెషల్ ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ ప్రత్యక్షం కావడం వారి అనైతిక సంబంధానికి నిదర్శనం కాదా అని ప్రశ్నంచారు.

 

 

Tags:    

Similar News