కలసే పోటీ చేస్తాం.. ఏకగ్రీవాాలపై అనుమానం

బీజేపీ, జనసేన పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలు సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై రెండు [more]

Update: 2021-01-27 05:57 GMT

బీజేపీ, జనసేన పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలు సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై రెండు పార్టీలు సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఆన్ లైన్ నామినేషన్ల ప్రక్రియను 29వ తేదీ లోపే ప్రారంభించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలోనూ బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని సోము వీర్రాజు తెలిపారు. ప్రభుత్వం ఏకగ్రీవం చేసుకోవాలని పిలుపునివ్వడంపై తమకు అనుమానాలున్నాయని వారన్నారు.

Tags:    

Similar News