బ్రేకింగ్ : ఏపీలో టీడీపీకి భారీ షాక్..!

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. టీడీపీకి చెందిన కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆ [more]

Update: 2019-01-16 07:12 GMT

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. టీడీపీకి చెందిన కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకే ఆయన ఇప్పటికే వైసీపీ నేత విజయసాయిరెడ్డితో చర్చలు జరిపారు. త్వరలోనే ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.

మూడునెలల క్రితమే ప్రచారం జరిగినా…

మూడు నెలల క్రితమే ఈ మేరకు ప్రచారం జరిగినా చంద్రబాబు నాయుడు బుజ్జగింపుతో ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఆయన చేరిక ఖాయమైంది. ఈ విషయాన్ని కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కడప జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున్ రెడ్డి. అయినా తనకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతప్తిలో ఉన్నారు.

Tags:    

Similar News