విశాఖలో బీజేపీ నేతల కీలక సమావేశం

విశాఖ పట్నంలో నేడు భారతీయ జనతా పార్టీ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నెల [more]

Update: 2021-02-07 02:54 GMT

విశాఖ పట్నంలో నేడు భారతీయ జనతా పార్టీ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నెల 14వ తేదీన దీనిపై బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రంలోని పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రతిపాదనతో ఆ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. దీంతో పాటు తిరుపతి ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు.

Tags:    

Similar News