పరారీలో బండ్ల గణేష్

సినీ నిర్మాత బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. బండ్ల గణేష్ తన అనుచరులతో కలసి సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ను బెదిరించారు. బండ్ల గణేష్ పై [more]

Update: 2019-10-05 03:48 GMT

సినీ నిర్మాత బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. బండ్ల గణేష్ తన అనుచరులతో కలసి సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ను బెదిరించారు. బండ్ల గణేష్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. బండ్ల గణేష్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీశారు. ఆ సినిమాకు పొట్లూరి వరప్రసాద్ ఏడు కోట్లు ఫైనాన్స్ చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా పీవీపికి ఇవ్వాల్సిన ఏడు కోట్ల రూపాయలను బండ్ల గణేష్ ఇవ్వడం లేదు. ఇటీవల పీవీపి తనకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి వత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో బండ్ల గణేష్ అనుచరులు పీవీపీపై బెదిరింపులకు దిగడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు.

Tags:    

Similar News