కేసీఆర్ ఫాంహౌస్ లో కూర్చుంటే ఎలా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. కేసీఆర్ [more]

Update: 2021-05-04 01:24 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. కేసీఆర్ వెంటనే ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీని పెట్టాలని ఆయన కోరారు. కక్ష సాధింపు చర్యలపై ఉన్న సమయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజారోగ్యంపై లేదని బండి సంజయ్ మండిపడ్డారు. ఆసుపత్రుల్లో దోపిడీని అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందని బండి సంజయ్ ఆరోపించారు.

Tags:    

Similar News