బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఎన్ని పొర్లుదండాలు పెట్టినా [more]

Update: 2020-12-18 12:47 GMT

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఎన్ని పొర్లుదండాలు పెట్టినా జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ అది సాధ్యం కాదని చెప్పారు. కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మోదీ, అమిత్ షాలను తిట్టిపోసి, ఢిల్లీకి వెళ్లి ఎందుకు వంగి వంగి దండాలు పెట్టారో చెప్పాలన్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరని బండి సంజయ్ తెలిపారు.

Tags:    

Similar News