బాలయ్య అందుకే దూరంగా ఉంటున్నారా..?

తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్ బాలకృష్ణ తన మాటల గారడితో అందరినీ ఆకర్షించే బాలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తను పోటీ చేసిన [more]

Update: 2019-03-19 08:15 GMT

తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్ బాలకృష్ణ తన మాటల గారడితో అందరినీ ఆకర్షించే బాలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తను పోటీ చేసిన నియోజకవర్గమే కాకుండా మిగిలిన నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం బాలయ్య క్యాంపైనింగ్ గట్టిగానే జరిగింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రం బాలయ్య చప్పుడే వినిపించడం లేదు. బాలయ్య మాట జారితే ప్రతిపక్షం వాళ్లు దాన్ని కాష్ చేసుకుని ట్రోల్స్ చేస్తుండటమే కారణమట.

హిందూపురానికే పరిమితం…

బాలయ్యను ప్రచారం తీసుకెళ్లాలని టీడీపీ క్యాండిడేట్లు పోటీ పడుతుంటారు. తమ నియోజకవర్గానికి రమ్మంటే తమ నియోజకవర్గానికి రమ్మంటూ పోటీ పడతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన వల్ల పార్టీకి లాభం జరగకపోగా.. నష్టం అవుతుందేమో అన్న భయం తెలుగుదేశం నాయకుల్లో పట్టుకుంది. అందుకే బాలయ్యను అధిష్టానం సైలెంట్ గా ఉండమన్నట్టు సమాచారం. దీంతో బాలయ్య తన నియోజకవర్గం అయిన హిందూపురానికే పరిమితం అయ్యారు.

Tags:    

Similar News