బదామీలో నిలిచిన పోలింగ్

Update: 2018-05-12 11:02 GMT

కర్ణాటక ఎన్నికల్లో ఉత్కంఠ రేపుతోన్న బదామీ నియోజకవర్గంలో ఎన్నిక నిలిచిపోయింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓ పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలింగ్ కొంతసేపు నిలిచిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ తరుపున బి.శ్రీరాములు పోటీలో ఉన్నారు. దీంతో ఇరు పార్టీలు ఈ నియోజకవర్గంలో గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డాయి. అయితే పోలీసలు ఇరువర్గాలను శాంతింప చేయడంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది.

Similar News