ఆయనతో జాగ్రత్త లోకేష్ గారూ…

ప్రజల కోసం పనిచేసే వారు కాకుండా ప్రత్యర్థులను ఎక్కువగా తిట్టే వారే తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకులు అవుతారని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీకి [more]

Update: 2019-02-16 10:28 GMT

ప్రజల కోసం పనిచేసే వారు కాకుండా ప్రత్యర్థులను ఎక్కువగా తిట్టే వారే తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకులు అవుతారని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఆయన ఇవాళ విశాఖపట్నం వచ్చారు. ఆయనకు వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలను అవంతి తిప్పికొట్టారు. నైతిక విలువల గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడటం హాస్యాస్పదమని, నమ్ముకున్న వారిని ఆయన మోసం చేస్తారని పేర్కొన్నారు. గంటాతో నారా లోకేష్ అప్రమత్తంగా ఉండాలని, గంటా లక్ష్యం దొడ్డిదారిన ముఖ్యమంత్రి కావడమేనని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పెరిగిపోతున్న అవినీతి, బంధుప్రీతి, కులపిచ్చిని సహించలేకే ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు.

Tags:    

Similar News