నా మీద పోటీకి రెండుసార్లు సర్వే

ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. చివరకు విశాఖ రైల్వే జోన్ ను కూడా చంద్రబాబు అప్పట్లో [more]

Update: 2020-01-22 07:23 GMT

ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. చివరకు విశాఖ రైల్వే జోన్ ను కూడా చంద్రబాబు అప్పట్లో విజయవాడకు తీసుకెళ్లాలని ప్రయత్నించారని చెప్పారు. అయితే తాను, అప్పటి ఎంపీ కంభంపాటి హరిబాబు అడ్డుకున్నామని అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాపులు ఉద్యమం చేస్తే చంద్రబాబు కేసులు పెట్టించారన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు భూ దోపిడీ చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. భీమిలీలో తనపై పోటీ చేయాలని లోకేష్ రెండు సార్లు సర్వేలు చేయించుకున్నారని, ఓటమి భయంతోనే అక్కడ పోటీ చేయలేదని చెప్పారు.

Tags:    

Similar News