అశ్వద్ధామరెడ్డి ఇంటి వద్ద

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 44వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంట్లోనే నిన్నటి నుంచి దీక్ష చేస్తున్నారు. పోలీసులు అశ్వద్థామ రెడ్డి దీక్షను [more]

Update: 2019-11-17 04:16 GMT

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 44వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంట్లోనే నిన్నటి నుంచి దీక్ష చేస్తున్నారు. పోలీసులు అశ్వద్థామ రెడ్డి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. చుట్టూ మహిళా కార్మికులు అశ్వద్ధామ రెడ్డి చుట్టూ పహారా కాస్తుండటంతో పోలీసులు సెన్సిటివ్ గా డీల్ చేస్తున్నారు. అశ్వద్ధామరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మొహరించారు. ఆయన ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు పోలీసులు అశ్వద్ధామ రెడ్డి దీక్షను భగ్నం చేయకుండా ఆర్టీసీ కార్మికులు సయితం అడ్డుకుంటున్నారు. మొత్తం మీద అశ్వద్ధామరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Tags:    

Similar News