నేడు కీలక సమావేశం.. ఎంతమంది హాజరవుతారో?

నేడు రాజస్థాన్ లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ అసంతృప్తి [more]

Update: 2020-07-13 02:45 GMT

నేడు రాజస్థాన్ లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అశోక్ గెహ్లాత్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సచిన్ పైలెట్ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో ఢిల్లీలో మకాం వేశారు. తాను సీఎల్పీ సమావేశానికి హాజరు కావడం లేదని సచిన్ పైలెట్ తెలిపారు. మరోవైపు సచిన్ పైలెట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తో జరిగేసమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది హాజరవుతారన్న టెన్షన్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది.

Tags:    

Similar News