చంద్రబాబుకు జగన్ ఫోబియా

టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందని మంత్రి అప్పలరాజు విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేటీకరిస్తుంది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. 2017లో [more]

Update: 2021-02-17 01:11 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందని మంత్రి అప్పలరాజు విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేటీకరిస్తుంది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. 2017లో చంద్రబాబు దక్షిణ కొరియా వెళ్లి పోస్కో ప్రతినిధులను కలిసిన మాట వాస్తవం కాదా? అని అప్పలరాజు ప్రశ్నించారు. విశాఖపట్నం వచ్చి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పై కాకుండా జగన్ ను తిట్టడానికే సమయాన్ని వెచ్చించారన్నారు. ముందు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులు రాజీనామాలు చేసి తర్వాత తమను రాజీనామాలకు డిమాండ్ చేయాలని అప్పలరాజు కోరారు.

Tags:    

Similar News