ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టవద్దని ఆదేశించింది. ప్రయివేటు స్థలాల్లో విగ్రహాలను పెట్టుకోవచ్చని సూచించింది. వినాయక చవతి ఉత్సవాల్లో [more]

Update: 2021-09-08 12:42 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టవద్దని ఆదేశించింది. ప్రయివేటు స్థలాల్లో విగ్రహాలను పెట్టుకోవచ్చని సూచించింది. వినాయక చవతి ఉత్సవాల్లో ఒకేసారి ఐదుగురికి మించి పాల్గొన కూడదని సూచించింది. ఆర్టికల్ 25 ప్రకారం మత పరమైన హక్కులను కాదనలేమని, అలాగే ఆర్టికల్ 21 జీవించే హక్కులను కూడా తోసిపుచ్చలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News