బ్రేకింగ్ : జగన్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

బిల్డ్ ఏపీ పథకంపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారానే అభివృద్ధి పనులను, రాష్ట్రాన్ని నడపదలచుకున్నారా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేల [more]

Update: 2020-05-26 08:49 GMT

బిల్డ్ ఏపీ పథకంపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారానే అభివృద్ధి పనులను, రాష్ట్రాన్ని నడపదలచుకున్నారా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేల కిలోమీటర్ల సముద్ర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో ప్రజలు ధనవంతులుగా, ప్రభుత్వం పేదరికంలో ఉన్నట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. బిల్డ్ ఏపీ పై దాఖలయిన ప్రజా ప్రజా ప్రయోజనం వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణను ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వఆస్తులను అమ్మడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఆదాయం కోసం ఇతర మార్గాలను అన్వేషించాలు తప్పించి అమ్మడమేంటని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Tags:    

Similar News