అనంతపురం ఘటనపై నివేదిక ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై ఏపీ హైకోర్టు విచారణ చేసింది. కరోనా నియంత్రణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతపురం లో ఆక్సిజన్ అందక జరిగిన కరోనా [more]

Update: 2021-05-07 01:25 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై ఏపీ హైకోర్టు విచారణ చేసింది. కరోనా నియంత్రణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతపురం లో ఆక్సిజన్ అందక జరిగిన కరోనా మరణాలపై నివేదిక ఇవ్వాని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కేంద్రాన్ని కూడా కోరింది. రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ను తరలించేలా చూడాలని కోరింది. మందులు, పడకల కొరత లేకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News