తెలంగాణ పవర్ పైన దెబ్బకొట్టిన ఏపీ ప్రభుత్వం

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ నీటి వినియోగం పై ఈ లేఖలో ఏపీ ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం [more]

Update: 2021-06-30 08:24 GMT

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ నీటి వినియోగం పై ఈ లేఖలో ఏపీ ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ అనుమలతులు లేకుండా నీటిని వినియోగిస్తుందని లేఖలో పేర్కొంది. శ్రీశైలం ప్రాజెక్టులో జరుగుతున్న విద్యుత్తు ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ శ్రీశైలం ప్రాజెక్టుకు 17.36 టీఎంసీల నీరు రాగా అందులో 6.9 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుందని ఫిర్యాదులో పేర్కొంది.

Tags:    

Similar News