బ్రేకింగ్ : రాజధాని తరలింపుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

రాజధాని తరలింపు ప్రక్రియపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపేయాలని పిటీషన్ [more]

Update: 2020-08-08 04:10 GMT

రాజధాని తరలింపు ప్రక్రియపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపేయాలని పిటీషన్ లో కోరింది. ఈ నెల 14 వరకూ రాజధాని తరలింపుపై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయంచింది. రాజ్యాంగ పరంగా సక్రమంగా అన్ని జరిగినా స్టే ఇవ్వడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశముంది.

Tags:    

Similar News