బ్రేకింగ్ : ప్రతి ఓటూ బీజేపీకే…నిలిచిపోయిన పోలింగ్

గుంటూరు జిల్లాలో వినుకొండ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల వేసిన ప్రతి ఓటూ బీజేపీకి పడుతుండటంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినుకొండ నియోజకవర్గంలోని పెద కంచర్ల [more]

Update: 2019-04-11 03:20 GMT

గుంటూరు జిల్లాలో వినుకొండ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల వేసిన ప్రతి ఓటూ బీజేపీకి పడుతుండటంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినుకొండ నియోజకవర్గంలోని పెద కంచర్ల పోలింగ్ కేంద్రంలో వేసిన ప్రతి ఓటూ బీజేపీకి పడుతుండటంతో అక్కడి ఓటర్లు ఎన్నికల అధికారులకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ పోలింగ్ ను నిలిపేశారు. ఏపీలో అనేక చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. పోలింగ్ ఇంకా అనేక చోట ప్రారంభం కాలేదు. వినుకొండ నియోజకవర్గంలో పానకాలపాలెంలోనూ వేసిన ప్రతి ఓటూ టీడీపీకి పడుతుందని ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు ఈవీఎంను ధ్వంసం చేశారు. అనేక చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News