జగన్ తో బ్యాంకు ప్రతినిధుల భేటీ

అంతర్జాతీయ బ్యాంకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులు ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బ్యాంక్ ఉపాధ్యక్షులు ఎన్ జాంగ్, ప్రాజెక్టు హెడ్ [more]

Update: 2019-09-05 11:37 GMT

అంతర్జాతీయ బ్యాంకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులు ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బ్యాంక్ ఉపాధ్యక్షులు ఎన్ జాంగ్, ప్రాజెక్టు హెడ్ రాజ్ పుర్కర్ మరియు ఇతర అధికారులు ఇవ్వాళతాడేపల్లిలోని జగన్ నివాసంలో కలిశారు. రాష్ట్రానికి 6వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదనత్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్నఅంశంపై చర్చించారు. రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రుణంలో 30శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70శాతంబ్యాంకు మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు,పరిశుభ్రమైన తాగునీరు సదుపాయంతో పాటు రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విన్నవించారు.

Tags:    

Similar News