జగన్ కు ఒక క్రెడిబులిటీ ఉంది.. మారి బాబుకో?

రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తన క్రెడిబులిటీ గురించి ప్రజలకు తెలుసున్ననారు. ఏపీ శాసనసభలో జగన్ మాట్లాడారు. జగన్ చెబితే [more]

Update: 2020-12-01 04:52 GMT

రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తన క్రెడిబులిటీ గురించి ప్రజలకు తెలుసున్ననారు. ఏపీ శాసనసభలో జగన్ మాట్లాడారు. జగన్ చెబితే చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పారు. అదే చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదన్నారు. చంద్రబాబుకు మోసం చేయడమే తెలుసునన్నారు. పద్దెనిమిది నెలలుగా ఒక డేట్ ఇచ్చి డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ఎప్పుడైనా తప్పామా? అని జగన్ ప్రశ్నించారు. రైతులకు డిసెంబరు 15వ తేదీన రైతులకు పరిహారం చెల్లిస్తామని చెప్పినా టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందని ప్రశ్నించారు. లబ్దిదారుల గుర్తించడం దగ్గర నుంచి నిధులు విడుదల చేయడం వరకూ ఒక ప్రొసీజర్ ఉంటుందన్నారు. డిసెంబరు 15న రైతులకు 1227 కోట్ల నిధులను విడుదల చేస్తామని చెప్పారు. తాము ఇస్తామంటున్నా పట్టుబట్టడమేంటన్నారు. చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకుంటుందన్నారు. పోడియం ముందు కూడా కుట్ర చేస్తున్నారన్నారు. అందరున్నా దళిత ఎమ్మెల్యేను మాత్రం ముందు పెడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు.

Tags:    

Similar News