బ్రేకింగ్ : కిడారి హత్య కేసులో కీలక మలుపు..!

Update: 2018-10-12 08:38 GMT

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్యలో పాల్గొన్న ఓ మహిళా మావోయిస్టును పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. శుక్రవారం ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులోని విశాఖ మన్యంలో మావోయిస్టులు, పోలీసులకు ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు ప్రమీల అలియాస్ మీన హతమయ్యారు. ప్రమీల మావోయిస్టు ముఖ్య నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ భార్య. ఆమెది వరంగల్ జిల్లాగా తెలుస్తోంది. ఇక, మరో నలుగురు మావోయిస్టులను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్, జయంతి, రాధిక, సుమన ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కిడారి, సోమ హత్యపై వీరి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏఓబీలో ఇంకా పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.

Similar News