ధూళిపాళ్ల అవకతవకలకు పాల్పడ్డారు.. ఏసీబీ ప్రకటన

సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ తెలిపింది. ఈ మేరకు ఏసీబీ ప్రకటన విడుదల చేసింది. సంగం డెయిరీలో ఆర్థిక, పాలనాపరమైన అవకతవకలు జరిగాయని [more]

Update: 2021-04-24 01:40 GMT

సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ తెలిపింది. ఈ మేరకు ఏసీబీ ప్రకటన విడుదల చేసింది. సంగం డెయిరీలో ఆర్థిక, పాలనాపరమైన అవకతవకలు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఇతరుల సహకారంతో ఛైర్మన్ నరేంద్ర అవకతవకలకు పాల్పడ్డారని, అందుకు తగిన ఆధారాలు లభించాయని ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ ఆస్తులను నరేంద్ర దుర్వినియోగం చేశారని పేర్కొంది. అందువల్లనే అరెస్ట్ చేశామని ఏసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags:    

Similar News