బెట్టింగ్ కేసు పెట్టినప్పుడు ఏమైంది?

తనపై బెట్టింగ్ కేసులు పెట్టినప్పుడు బీసీ అని గుర్తుకు రాలేదా? అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈఎస్ఐ స్కామ్ లో జరిగిన అవినీతికి బాధ్యులైన [more]

Update: 2020-02-22 05:18 GMT

తనపై బెట్టింగ్ కేసులు పెట్టినప్పుడు బీసీ అని గుర్తుకు రాలేదా? అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈఎస్ఐ స్కామ్ లో జరిగిన అవినీతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అచ్చెన్నాయుడు బీసీ అయితే విచారణ జరపకూడదా? అని ప్రశ్నించారు. అవినీతిని కప్పిపుచ్చడానికే టీడీపీ బీసీ కార్డును వాడుతుందన్నారు. తాను కూడా బీసీనని, తనపై అక్రమ కేసులు బనాయించినప్పుడు ఈ టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఆరోజు తాన బీసీ అని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. వందల కోట్ల స్కామ్ చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

Tags:    

Similar News