ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోలేదా..?

Update: 2018-09-07 08:21 GMT

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ... తెలుగువారంతా కలిసి ఉండాలంటునూ జాగో, బాగో అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు. ఆంధ్రోళ్ల ఓట్లను వేయించుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో టీడీపీ వాళ్లు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసన్నారు. ఆంధ్రోళ్ల ఓట్లతో గెలిచిన వారిని కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకోలేదా అని ప్రశ్నించారు.

Similar News