ముగిసిన కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటుపై [more]

Update: 2019-12-27 07:59 GMT

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటుపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. ఎక్కువ మంది మంత్రులు సచివాలయం విశాఖకు తరలించడమే బెటరని పేర్కొన్నారు. దీంతో పాటు నిర్ణయంపై అఖిలపక్షం ఏర్పాటు పై కూడా జగన్ మంత్రులతో చర్చించారు. అయితే చాలా మంది మంత్రులు అఖిపక్ష సమావేశానికి విముఖత చూపినట్లు సమచారం. దీంతో పాటు బోస్టన్ కమిటీ నివేదిక ఈ నెల 3వ తేదీన ప్రభుత్వానికి అందనుంది. ఇప్పటికే బోస్టన్ కమిటీ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని బెటరని తన మధ్యంతర నివేదికలో పేర్కొంది. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News