ఆంధ్ర ప్రజల కోరిక ఏంటో చెప్పిన కేటీఆర్

Update: 2018-09-05 08:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, ఆయన పాలనను దేశమొత్తం మెచ్చుకుంటోందని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ... గతంలో కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ పట్ల సీమాంధ్ర నాయకులు తప్పుడు ప్రచారం చేసి ప్రజలు అపార్థం చేసుకునేలా చేశారని, కానీ ఇప్పడు కేసీఆర్ పాలనను చూసి టీఆర్ఎస్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి కూడా పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 50 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను కడగడానికి నాలుగేళ్లు చాలదని ఆయన వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ నేతలకు పుట్టగతులు ఉండవని కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మళ్లీ టీఆర్ఎస్ నే గెలిపించాలని ప్రజలను కోరారు.

Similar News