బాబుపై ఆనం ఫైర్....!!

Update: 2018-11-06 07:03 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి ఫైరయ్యారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాశనం చేస్తున్నారన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే కేసును పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంటలిజెన్స్ వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారన్నారు. ఇంటలిజెన్స్ వ్యవస్థను తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇంటలిజెన్స్ ను వాడుతున్నారని, జగన్ పై హత్యయత్నాన్ని కౌంటర్ ఇంటలిజెన్స్ ను ఎందుకు పసిగట్టలేకపోయిందని ఆనం ప్రశ్నించారు.

భ్రష్టుపట్టించారు......

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించి కేంద్రంలో చక్రం తిప్పడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. తెలుగురాష్ట్రంలో నారాసురుడి పాలన పోవాలని ఆనం అన్నారు. అప్పుడే అసలైన దీపావళి అని చెప్పారు. వ్యవస్థలను వాడుకోవడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే ఎవరూ లేరన్నారు. ఆపరేషన్ గరుడ అని చెప్పిన శివాజీని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. వైసీపీ నేత జోగి రమేష్ ను మాత్రం పిలిచి విచారిస్తారా? అని నిలదీశారు. రాష్ట్ర ఆర్థికమంత్రి, చంద్రబాబు కలసి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. సంక్షోభంలో చంద్రబాబు తన సంక్షేమం చూసుకున్నారే తప్ప, ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. వైసీపీలో చేరిన తర్వాత తొలిసారి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కార్యాలయంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Similar News