ఆనం పంచాయతీకి ఫుల్ స్టాప్

వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. తాను చేసిన కామెంట్స్ పై ఆనం జగన్ కు వివరణ ఇచ్చుకున్నారు. [more]

Update: 2019-12-13 01:38 GMT

వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. తాను చేసిన కామెంట్స్ పై ఆనం జగన్ కు వివరణ ఇచ్చుకున్నారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వాలని భావించిన షోకాజ్ నోటీసును ఇవ్వనవసరం లేదని వైసీపీ నిర్ణయించింది. నిన్న రాత్రి నెల్లూరు ఇన్ ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డితో కలసి ఆనం రామనారాయణరెడ్డి జగన్ తో భేటీ అయ్యారు. నెల్లూరులో మాఫియా పెరిగిందని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై ఆనం రామనారాయణరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. తాను అధికారపార్టీని ఉద్దేశించి అనలేదని ఆనం చెప్పారు. అయితే ఏదైనా ఉంటే నేరుగా తనతో చెప్పవచ్చని మీడియాకు ఎక్కవద్దని జగన్ ఆనంరామనారా‍యణరెడ్డికి చెప్పినట్లు తెలిసింది. దీంతో షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న వైసీపీ ఆ ఆలోచనను విరమించుకుంది.

Tags:    

Similar News