నేడు జగన్ వద్దకు ఆనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నేడు కలవనున్నారు. నెల్లూరులో మాఫియా పెరిగిపోయిందని సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి [more]

Update: 2019-12-11 02:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నేడు కలవనున్నారు. నెల్లూరులో మాఫియా పెరిగిపోయిందని సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో జగన్ సీరియస్ అయ్యారు. వివరణ ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డితో ఆనం రామనారాయణరెడ్డికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌తో బుధవారం భేటీ అయి ఆనం రామనారాయణరెడ్డి వివరణ ఇచ్చుకోనున్నారు.

Tags:    

Similar News