ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్.. అమిత్ షా ఫైర్

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నిర్మల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు [more]

Update: 2021-09-17 12:22 GMT

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నిర్మల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి అధికారం అందుకోబోతోందని జోస్యం చెప్పారు. కారు స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో ఉందని అమిత్ షా అన్నారు. ఒవైసీ చెప్పినట్లే కేసీఆర్ నడుచుకుంటున్నారని, ఎంఐఎంను ఎదిరించేది బీజేపీ ఒక్కటేనని అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు.

Tags:    

Similar News