అమిత్ షాకు కోర్టు సమన్లు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ లోని ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పరువు [more]

Update: 2021-02-20 00:38 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ లోని ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అమిత్ షా హాజరు కావాల్సిందేనని ఎంపీలు, ఎమ్మెల్యలే కేసుల ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. అభిషేక్ బెనర్జీ పై అమిత్ షా 2018లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన అభిషేక్ బెనర్జీ వెంటనే పరువునష్టం దావా వేశారు. ఈ నెల 22వ తేదీన అమిత్ షా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News