తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. మే 2వ తేదీన

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీన రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ ను నిర్వహించాలని నిర్ణయించింది. మే 2 వతేదీన తమిళనాడు ఎన్నికల [more]

Update: 2021-04-30 01:29 GMT

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీన రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ ను నిర్వహించాలని నిర్ణయించింది. మే 2 వతేదీన తమిళనాడు ఎన్నికల ఫలితాల కౌంటింగ జరగనుంది. ఆ రోజు లాక్ డౌన్ జరపాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న నైట్ కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించింది. తమిళనాడులో ఈ నెల 20 వతేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో దీనిని మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించారు. ప్రజలు సహకరించాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో కోరింది.

Tags:    

Similar News