అమెరికాలో కాల్పులు తెలుగు యువకుడు బలి

Update: 2018-07-08 03:18 GMT

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తెలంగాణ విద్యార్థిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కొప్పుల శరత్ అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. శరత్ మిస్సోరిలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. స్నేహితుల ద్వారా శరత్ తల్లిదండ్రులకు ఈ సమాచారం అందింది. కుమారుడి మృతి విషయంపై శరత్ తల్లిదండ్రులు డీజీపీని కలిశారు. శరత్ తండ్రి హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ కుమారుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలోని కెన్సాస్ సిటీలోని ఒక రెస్టారెంట్ లో ఈ కాల్పులు జిరిగాయి. ఈ కాల్పుల్లోనే శరత్ మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారం అందింది. ఆమెరికాలోని కెన్సాస్ సిటీలో తమ కుమారుడి పై జరిగిన కాల్పులు వివరాలు తెలిసేలా చొరవ తీసుకోవాలని శరత్ తల్లిదండ్రులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కేన్సస్ లోని ముస్సోరి హాస్పటల్ నుండి తమకు ఫోన్ కాల్ వచ్చినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Similar News