నిమ్మగడ్డ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అట

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అన్న ప్రచారం జరుగుతుందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. భవిష్యత్ లో చంద్రబాబు ప్రధానమంత్రి అని, [more]

Update: 2021-02-03 07:58 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అన్న ప్రచారం జరుగుతుందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. భవిష్యత్ లో చంద్రబాబు ప్రధానమంత్రి అని, లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి అని, అచ్చెన్నాయుడు హోంమంత్రి, నిమ్మగడ్డ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అని ఆ పార్టీ ప్రచారం జరుగుతుందన్నారు. అది పగటి కలే అని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని అన్నారు. చంద్రబాబు పట్టాభి మీద దాడి జరిగితే ఎన్టీఆర్ కుమించి నటించారన్నారు. చంద్రబాబు తనను చంపుతారా? అని ప్రశ్నించారని, ఇప్పటికే చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గొల్లలపూడికి లోకేష్ కు పైలట్ గా వెళ్లినట్లుందని అంబటి రాంబాబు చమత్కరించారు. ఎన్నికల కమిషన్ టీడీపీ అవతారమెత్తి పరామర్శలకు వెళుతుందన్నారు.

Tags:    

Similar News