అఖిలప్రియ విషయంలో ఎందుకు బాబు మాట్లాడరు?

అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీలు కలసి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. [more]

Update: 2021-01-16 07:00 GMT

అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీలు కలసి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కులాలు,మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణిగివేస్తామన్నారు. చంద్రబాబు మతాలపై చేస్తున్న వ్యాఖ్యలు నిస్సిగ్గుగా ఉన్నాయన్నారు. మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తే సహించమని అంబటి రాంబాబు తెలిపారు. వైఎస్సార్ పార్టీకి కులం, మతాలు లేవన్నారు. కరోనా కష్టాల సమయంలోనూ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించామన్న విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు. అఖిలప్రియ అరెస్ట్ అయితే ఎందుకు చంద్రబాబు మౌనంగా ఉన్నారన్నారు.

Tags:    

Similar News