బ్రేకింగ్ : ఆమంచి అనుచరులతో సమావేశం.. ఆ తర్వాత?

వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో సమావేశమయ్యారు. చీరాలలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అనుచరులతో చర్చిస్తున్నారు. వైసీపీ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా చీరాలలో [more]

Update: 2020-05-23 06:35 GMT

వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో సమావేశమయ్యారు. చీరాలలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అనుచరులతో చర్చిస్తున్నారు. వైసీపీ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా చీరాలలో ఆమంచి, కరణం వర్గీయులు పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థిితి నెలకొంది. వాలంటీర్ల పోస్టులన్నీ కరణం చెప్పిన వారికే ఇవ్వడంతో తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని ఆమంచి కృష్ణమోహన్ భావిస్తున్నారు. చీరాల నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవిని కరణం వెంకటేష్ కు ఇస్తారన్న ప్రచారం గత వారం రోజులుగా జరుగుతుంది. దీంతో అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఆమంచి కృష్ణమోహన్ రెడీ అయ్యారని చెబుతున్నారు. ఇలాగే కరణంకు ప్రాధాన్యత కొనసాగితే పార్టీని వీడేందుకు కూడా వెనకాడబోనని సంకేతాలు ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. చీరాలలో ఫ్లెక్సీల ఏర్పాటులో పోటా పోటీ పడటంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

Tags:    

Similar News