బాబూ దండం పెడతాం.. రాజకీయం చేయమాకు

చంద్రబాబు కరోనా విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు కరోనా కట్టడికి ప్రయత్నిస్తుందన్నారు. దయచేసి చంద్రబాబు ప్రజలను భయపెట్టే [more]

Update: 2020-03-24 09:22 GMT

చంద్రబాబు కరోనా విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు కరోనా కట్టడికి ప్రయత్నిస్తుందన్నారు. దయచేసి చంద్రబాబు ప్రజలను భయపెట్టే విధంగా ప్రకటనలు చేయవద్దని ఆళ్ల నాని కోరారు. ఇదే రకంగా చంద్రబాబు వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. విశాఖలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ స్పెషల్ కాన్సన్ ట్రేషన్ చేశామన్నారు. నిత్యం సమీక్షలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖలోనే 1470 మందిని క్వారంటైన్ లో ఉంచామన్నారు. జగన్ ఎప్పటికప్పుడు తమకు, అధికారులకు దీనిపై సూచనలు చేస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News