ఎలుగుబంటిని చంపి.. సెల్ఫీలను తీసుకుని?

కామారెడ్డి లో లో దారుణం చోటుచేసుకుంది . గ్రామంలో కి వచ్చిన ఎలుగుబంటి ని గ్రామస్తులు అందరూ కలిసి కొట్టి చంపారు. గ్రామస్తులు ఎలుగుబంటిని కొడుతున్న సమయంలో [more]

Update: 2020-05-23 06:50 GMT

కామారెడ్డి లో లో దారుణం చోటుచేసుకుంది . గ్రామంలో కి వచ్చిన ఎలుగుబంటి ని గ్రామస్తులు అందరూ కలిసి కొట్టి చంపారు. గ్రామస్తులు ఎలుగుబంటిని కొడుతున్న సమయంలో సెల్ఫీ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో ఒక ఎలుగుబంటు కనబడింది. దీంతో గ్రామస్తులు అందరూ మూకుమ్మడిగా దగ్గరికి వెళ్ళారు . గ్రామస్తుల మీదకు ఎలుగుబంటి వచ్చే ప్రయత్నం చేసింది. దీంతో గ్రామస్తులు అందరూ కర్రలతో ఎలుగుబంటి పైన దాడి చేశారు. ఈ దాడిలో ఎలుగుబంటి అక్కడికక్కడే చనిపోయింది . అయితే ఎలుగుబంటి ని చంపి వేస్తున్న సమయంలో కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News