బ్రేకింగ్ : అజిత్ పవార్ నిర్భంధం

మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా నడిచింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ను ఎన్సీపీ నేతలు గదిలో బంధించారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో ఉండగా ఎన్సీపీ [more]

Update: 2019-11-25 07:57 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా నడిచింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ను ఎన్సీపీ నేతలు గదిలో బంధించారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో ఉండగా ఎన్సీపీ నేతలు వెళ్లి ఆయనను గది నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే గదిలో ఉంచి అజిత్ పవార్ చేత శరద్ పవార్ తో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నారు. అజిత్ పవార్ గదిలో నుంచి బయటకు రాకుండా ఎన్సీపీ నేతలు కాపలా కాస్తున్నారు. అజిత్ పవార్ మాత్రం బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎన్సీపీ నేతలు అడ్డుకుంటున్నారు. తిరిగి పార్టీలోకి రావాలని ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ ను కోరుతున్నట్లు తెలిసింది. దివంగత నేత యశ్వంత్ రావు చవాన్ కు నివాళులర్పించేందుకు అజిత్ పవార్ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News