జగన్ పై ఆది ఫైర్…!!

వైఎస్సార్ కాంగ్రెైస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డి ఫైరయ్యారు. జగన్ కు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కావడం అస్సలు ఇష్టం లేదన్నారు. [more]

Update: 2018-12-27 08:10 GMT

వైఎస్సార్ కాంగ్రెైస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డి ఫైరయ్యారు. జగన్ కు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కావడం అస్సలు ఇష్టం లేదన్నారు. జగన్ కు ధనదాహం ఎక్కువన్నారు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కుదామా? అన్న తపన తప్పించి సొంత జిల్లాకు ప్రయోజనం చేయాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ రాకూడదనే జగన్ కోరుకుంటున్నారని, అయితే చంద్రబాబు పట్టుదల వల్లనే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరగబోతుందన్నారు. దీనివల్ల దాదాపు ఇరవై వేలమందికిపైగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరోక్షంగా లక్షలాది మంది లబ్దిపొందుతారన్నారాయన.

Tags:    

Similar News