బ్రేకింగ్ : ఏపీలో వాళ్లంతా పాసయినట్లే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. [more]

Update: 2020-03-26 08:49 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వారందరీని పై క్లాస్ లకు ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించలేమని చెప్పారు. అదే సమయంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నదీ తాము చెప్పలేమని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సరుకులను వారి ఇళ్లకే పంపుతున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.

Tags:    

Similar News