రకుల్ కు హైకోర్టులో ఊరట

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో తనపై జరుగుతున్న ప్రచారాన్ని నిలుపుదల చేయాలంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును [more]

Update: 2020-09-17 06:43 GMT

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో తనపై జరుగుతున్న ప్రచారాన్ని నిలుపుదల చేయాలంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం జరుగుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు స్వీయ నియంత్రణ పాటించాలని పేర్కొంది. విచారణ జరిపిన జస్టిస్ నవీన్ చావ్లా బెంచ్ కేంద్ర సమాచార శాఖకు డ్రగ్స్ కేసులో స్వీయ నియంత్రణ పాటించాలనిఆదేశించింది. కొన్నాళ్లుగా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రియా చక్రవర్తితో రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధాలున్నాయని కూడా ప్రచారం చేసింది.

Tags:    

Similar News