ఏబీపై దర్యాప్తు కు ప్రభుత్వం ఆదేశం

ఏపీ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాను నియమించింది. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు [more]

Update: 2021-03-10 01:04 GMT

ఏపీ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాను నియమించింది. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ డీజీపీ గా వ్యవహరించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులను బెదిరించారన్న ఆరోపణలున్నాయి. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969 ప్రకారం నిబంధనలకు లోబడి విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. విచారణాధికారి ఎదుట ప్రభుత్వం తరుపున వాదనలను విన్పించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించింది.

Tags:    

Similar News