వైసీపీ ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టులో?

వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా, విడదల రజనీ, [more]

Update: 2020-05-20 02:37 GMT

వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా, విడదల రజనీ, కావేటి సంజీవయ్య, హఫీజ్ ఖాన్ తదితరులపై హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. తాజాగా మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పిటీషన్ వేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ఉండవల్లి శ్రీదేవిలపై పిటీషన్ దాఖలయింది. దీంతో నేడు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.

Tags:    

Similar News