ప్రియురాలి కోసం....6 కోట్లు...?

Update: 2018-04-20 01:30 GMT

ప్రియురాలి కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాడు ఓ ప్రభుద్ధుడు. జల్సాలు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాలలోకి వెలితే.. విజయవాడకి చెందిన అవ్వారు లక్ష్మీ దీపక్ హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టాక్ మార్కెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. అయితే తన క్లయింట్ల వద్ద కోట్ల రూపాయల డబ్బు చూసిన దీపక్.. దురాశతో ఆలోచించాడు. ఫేస్ బుక్ ద్వారా దీపక్ కు ఢిల్లీ కి చెందిన మనీషా శర్మతో పరిచయం ఏర్పడింది. మనీషా శర్మ ప్రేమలో పడ్డ దీపక్.. ఆమె కోసం తరచు ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్తుండే వాడు. అక్కడ 5 స్టార్ హోటల్స్ లో విలాసవంత జీవితాన్ని గడిపేవాడు. ఇదంతా తన క్లయింట్ షేర్ల ద్వారా తన అకౌంట్ లో వేసుకున్న డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ మనీషా శర్మ తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దీపక్ ను సహాయం అడిగేది.. దీంతో కాలపరిమితి ముగిసిన.. షేర్లు ఉన్న తన క్లయింట్ల డిపాజిట్ల ను తీసుకొని..వాటి ద్వారా వచ్చిన డబ్బులను తన అకౌంట్ లో వేసుకొని విలాసాల కోసం ఖర్చు చేసాడు. తన ఢిల్లీ ప్రియురాలి కోసం ఏకంగా.. లక్షల రూపాయల విలువ చేసే డ్రెస్సులు, చెప్పులు ఖరీదైన బహుమతులు ఇచ్చేవాడు. కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ప్రబుద్ధుడి చేతిలో మోసపోయిన హైద్రాబాద్ కి చెందిన.. డాక్టర్ వినయ్, ప్రదీప్ రెడ్డి, ఉషారాణి లు కొద్దీ నెలల క్రితం హైద్రాబాద్ సీసీఎస్ లో పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు ఖంగుతినే విషయాలు తెలిసాయి. ఇతగాడు చేసిన విలాసాలకు చూసి పోలీస్ అధికారులే ఆశ్చర్య పోయారు. అమ్మాయిల కోసం గోవా, ఢిల్లీ లలో ఎంజాయ్ చేసిన దీపక్.. ఢిల్లీ ప్రియురాలు మనీషా శర్మ కు కోట్ల రూపాయల ఖర్చు చేసేవాడిని పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా ఢిల్లీ కి వెళ్లిన పోలీసులు.. మనీషా శర్మను అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన లక్ష్మీ దీపక్ తో పాటు అతనికి సహకరించిన శ్రవణ్ కుమార్ ని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. లక్ష్మీ దీపక్ వద్ద ఉన్న 60 లక్షల రూపాయల విలువ చేసే షేర్లను పోలీసులు సీజ్ చేశారు.

Similar News