నేడు ఢిల్లీలో షర్మిల ధర్నా

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ధర్నా చేయనున్నారు

Update: 2023-03-14 02:12 GMT

ys sharmila hunger strike

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ధర్నా చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ షర్మిల ధర్నా నిర్వహించనున్నారు. ధర్నా అనంతరం జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంటు వరకూ ర్యాలీగా వెళ్లేందుకు ఆ పార్టీ ప్లాన్ చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని దేశ వ్యాప్తంగా తెలియజేసేందుకు తాము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని వైఎస్సార్టీపీ నేతలు చెబుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో...
కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ గత కొంతకాలంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా షర్మిల ఢిల్లీలో దీక్షను చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పార్లమెంటు వరకూ ప్రదర్శనకు మాత్రం పోలీసులు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ధర్నా వరకే పరిమితమయ్యేలా ఆందోళన నిర్వహించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News