కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తుకొచ్చారా?

ఎన్నికల ఏడాదిలో మహిళా దినోత్సవం రాగానే కేసీఆర్ కు మహిళలు గుర్తుకొచ్చారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

Update: 2023-03-07 12:18 GMT

ys sharmila arrest

ఎన్నికల ఏడాదిలో మహిళా దినోత్సవం రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలు గుర్తుకొచ్చారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి, మూడేండ్లుగా దాదాపు 4వేల కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలోని 46.10లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కేసీఆర్ మోసం చేశారని, ఎన్నికలకు రాగానే ఇప్పుడు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు.

మహిళల ఓట్ల కోసమే...
మహిళల ఓట్ల కోసమే కేసీఆర్ ఇప్పుడు పట్టుమని 750కోట్లు ఇచ్చి, మహిళల పట్ల మరోసారి కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వ్యవహార శైలితోతో మహిళలు అవస్థలు పడుతున్నారని, బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన చెందరారు. మహిళల పట్ల కేసీఆర్‌కు నిజంగానే ప్రేమ ఉంటే పూర్తిగా 4వేల కోట్ల బకాయిలు చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ మాయమాటలు ఎవరూ నమ్మవద్దని ఆమె కోరారు.


Tags:    

Similar News